
వరల్డ్ కప్ ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది దాంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ మార్పులకు ముందస్తు ప్రణాళిక చేస్తోంది. ఇందులో భాగంగా భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేయనుంది. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మను కూడా సెలక్షన్ కమిటి నుండి తీసేస్తుంది 2022లో ఒక్క icc టోర్నమెంట్ కూడా భారత జట్టు గెలవలేకపోయింది. అందుకే bcci ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ను ప్రధాన కోచ్గా నియమించే సూచన ఉంది. ఈ ఏడాది నవంబర్లో వన్డే ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ పూర్తీ అవుతుంది, ఆయన స్థానంలో మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కొన్ని జాతీయ వార్తా కథనాల్లో పేర్కొన్నారు.
జనవరి 1న బీసీసీఐ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన bcci. ఈ సమావేశానికి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మను పిలవలేదు. 2023 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్కు సంబంధించిన ప్రణాళిక ఈ సమావేశంలో చర్చించారు. మార్పులు, వ్యూహాలను రూపొందించారు.
రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ ఇప్పటికే భారత జట్టు పలు కోచింగ్ సూచనలని నిర్వహించారు. ఆసియా కప్ 2022 సమయంలో రాహుల్ ద్రవిడ్కు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వీవీఎస్ లక్ష్మణ్.. కోచ్ బాధ్యతలు నిర్వహించారు. ద్రావిడ్ కోలుకొని జట్టుతో కలవడంతో ఆ తర్వాత తిరిగి భారత్ కి వచ్చేశారు.
లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులో ‘నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్’గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్, T20 ప్రపంచ కప్ తర్వాత ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన T20 సిరీస్ సందర్భంగా లక్ష్మణ్.. ఎన్సీఏ డైరెక్టర్గా తిరిగి తన బాధ్యతలు చేపట్టారు
జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి స్థాయిలో కోచ్గా బాధ్యతలు నిర్వహించారు. ఐర్లాండ్తో జరిగిన రెండు-మ్యాచ్ల T20 సిరీస్లో VVS లక్ష్మణ్ తొలిసారిగా టీమ్ ఇండియాకు కోచ్గా వ్యవహరించారు. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్.. ఇంగ్లాండ్తో షెడ్యూల్ చేసిన టెస్ట్ మ్యాచ్ కోసం జట్టు కూర్పు విషయంలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20కి వివిస్ లక్ష్మణ్ హెడ్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.