భారత ఆటగాళ్ళ చరిత్ర అంటేమాములుగా ఉండదు వాళ్ళు సాధించిన ఆవార్డ్స్ ఘనతలు ఇన్నింగ్స్ ఇవన్ని చుస్తే అరె వహ్ అనిపిస్తుంది మూడు పదుల వయసు దాటుతున్న సీనియర్ ఆటగాళ్లకి కొంతమందికి ఇంకా ఆట ఏమాత్రం తగ్గలేదు ఐన వాళ్ళ కెరీర్ బలవంతంగా ముగించాల్సి వస్తుంది మరి వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం
టెస్ట్ స్పెసలిస్ట్ అజింక రేహనే
రెండేళ్ల క్రితం వరకు టీమిండియా టెస్టు జట్టులో మూలస్తంభంలా నిలిచిన ఆటగాడు అజింక్య రహానే. కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా గెలిపించాడు. అయితే ఆ తర్వాత రహానే పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. అతనితోపాటు ఫామ్ లేక తంటాలు పడిన పుజారా కౌంటీల్లో ఆడి మళ్లీ గాడిన పడగా.. రహానే మాత్రం పునరాగమనం చేయలేకపోయాడు.
ప్రస్తుతం యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తన అద్బుతమైన క్లాసిక్ షాట్స్ తో రహానే స్థానాన్ని ఆక్రమించాడు. దీనికితోడు రహానే ఇటు దేశవాళీ క్రికెట్ లో కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇలాంటి సమయంలో రహానేకు మళ్లీ టీమిండియా నుంచి పిలుపు రావడం, అది కూడా ఈ ఏడాదిలో రావడం ఆసాధ్యం
సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్
దినేష్ కార్తీక్ ఎంత గొప్ప ఆటగాడో మన అందరికి తెలుసు కానీ మధ్యలో అతని వ్యక్తిగతమైన జీవితం క్రికెట్ నీ నాశనం చేసింది దాంతో తను తిరిగి మళ్ళి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది కానీ మొత్తానికి అయితే మాత్రం దినేష్ కార్తీక్ సాధించాడు కానీ ఇప్పుడు అతని కెరీర్ దాదాపు ముగిసినట్టే t20 వరల్డ్ కప్ లో తను ఆడాలని అనుకున్నాడు అలాగే ఆడాడు కూడా కానీ ఫైనల్ కి భారత్ కి చేరుకోకపోవడం నిరాశే అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు
2022లో మొత్తం 22 టీ20 మ్యాచుల్లో ఆడిన అతను 141.38 స్ట్రైక్ రేటుతో 287 పరుగులు చేశాడు.
కానీ టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ 37 ఏళ్ల ఫినిషర్ను సెలెక్టర్లు మళ్లీ ఎంపిక చేయలేదు. అతని స్థానంలో కుర్రాళ్లకు చోటివ్వాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఐపీఎల్లో డీకే చెలరేగినా.. టీమిండియాలో చోటు దక్కడం కుదరని పనిగా కనిపిస్తోంది.