
2022 భారత క్రికెట్ జట్టుకి ఒక రకంగా మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే icc ట్రోఫీలు ఏమి గెలవలేకపోయింది కనీసం ఫైనల్ కి కూడా చేరుకోలేకపోటింది. కానీ కొత్త ఏడాదిలో సీనియర్ ఆటగాళ్ళు లేకపోవడం తో యువ ఆటగాళ్లు భారత్-శ్రీలంక మధ్య సిరీస్ లో సత్తా చాటనున్నారు. ఈరోజు (జనవరి 3 మంగళవారం) ప్రారంభం కానున్న టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు సువర్ణావకాశం లభించనుంది. ఈ సిరీస్లో కేవలం 4 వికెట్లు తీయడం ద్వారా, అతను టీమిండియా తరపున అత్యధిక టీ20 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేరిట నమోదైంది
భువనేశ్వర్ కుమార్ భారత్ తరపున 87 టీ20 మ్యాచ్లు ఆడి 90 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, యుజ్వేంద్ర చాహల్ కేవలం 71 టీ20 మ్యాచ్లలో 87 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్లో భువనేశ్వర్ కుమార్ భాగం కాకపోవడంతో భువీని వదిలిపెట్టేందుకు చాహల్కు మంచి అవకాశం ఉంది. ఈ జాబితాలో ఆర్. అశ్విన్ (72) మూడో స్థానంలో, జస్ప్రీత్ బుమ్రా (70) నాలుగో స్థానంలో, హార్దిక్ పాండ్యా (62) ఐదో స్థానంలో ఉన్నారు.
చాహల్ టీ20I కెరీర్..
యుజ్వేంద్ర చాహల్ 2016లో టీ20I అరంగేట్రం చేశాడు. గత 6 సంవత్సరాల్లో టీ20 క్రికెట్లో భారత ప్రధాన స్పిన్నర్గా ఎదిగాడు. 71 టీ20 మ్యాచ్లలో, అతను 24.78 బౌలింగ్ సగటు, 8.13 ఎకానమీ రేటుతో 87 వికెట్లు తీశాడు. ఒకసారి 5 వికెట్లు, రెండుసార్లు 4 వికెట్లు తీశాడు. 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం చాహల్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
టీ20 ప్రపంచకప్లో దక్కని అవకాశం..
టీమ్ ఇండియా స్పిన్ విభాగంలో నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. గత రెండు టీ20 ప్రపంచకప్లలో యుజ్వేంద్ర చాహల్కు ఒక్కసారి కూడా అవకాశం దక్కలేదు. టీ20 ప్రపంచ కప్ 2022లో, అతను జట్టులో చేరాడు. కానీ, ప్లేయింగ్-11లో అక్షర్ పటేల్, ఆర్. అశ్విన్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో, చాహల్కు ఛాన్స్ దక్కలేదు. అదే సమయంలో, చాహల్ టీ20 ప్రపంచ కప్ 2021 కోసం భారత జట్టులో అవకాశం దక్కలేదు.